Sunday 8 August 2021

RGUKT : IIIT Basara 2021-22 Admissions

    

RGUKT BASAR

 రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్‌జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో 2021-22కు ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసారి పాలిసెట్‌ ఎంట్రన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు కల్పించనున్నారు.


అర్హతలు

    @ 2020-21లో పదో తరగతి పాసై, పాలిసెట్‌ ఎంట్రన్స్‌ రాసిన విద్యార్థులు మాత్రమే.

    @ డిసెంబర్‌ 31, 2021 నాటికి 18 ఏండ్ల్లు, ఎస్సీ, ఎస్టీలకు 21 ఏండ్లు మించకూడదు.

రిజర్వేషన్లు: 

    @ ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం.

    @    ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు ఫ్రీ, సైనిక ఉద్యోగులకు 1 శాతం, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5 శాతం భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు:

    @ మీ సేవ  కేంద్రాల్లో admissions@rgukt.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

    @ ఓసీ, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్‌ ఫీజు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.150 చెల్లించాలి.

    అప్లికేషన్‌ ఫీజుతోపాటు సర్వీస్‌ చార్జీ కింద ఆన్‌లైన్‌ సెంటర్లకు అదనంగా రూ.25 లేదా ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు:

రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రూ.36 వేలు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీలు రూ. 500 చొప్పున చెల్లించాలి. ఇతర రేషన్‌, గల్ఫ్‌దేశాల్లో చదివే అభ్యర్థులు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ.3.01 లక్షల ఫీజు చెల్లించాలి.

సర్టిఫికెట్స్‌:

ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఇచ్చిన రసీదు. మార్కుల లిస్టు, నివాస సర్టిఫికెట్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్‌, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

గ్రేడ్‌పాయింట్లు సమానమైతే..

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు పాలిసెట్‌లో వచ్చిన మార్కులకు 4.8 మార్కులు కలపనున్నారు. సంబంధిత కేటగిరీలో విద్యార్థుల మార్కులు ఒకేలా ఉంటే గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవీ కూడా సమానంగా ఉంటే విద్యార్థి పుట్టినతేదీ ప్రకారం ఎవరు పెద్దవారైతే వారికి సీటు కేటాయిస్తారు. ఇవి కూడా సమానంగా ఉంటే పదో తరగతిలో విద్యార్థి హాల్‌ టికెట్‌ నంబర్‌, ర్యాండమ్‌లో ఎవరికి తక్కువగా ఉంటే వారిని ఎంపిక చేస్తారు.

4.8 మార్కులు కలిపేది వీరికే..

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పాసై, పాలిసెట్‌లో సాధించిన మార్కులకు 4.8 మార్కులు కలుపనున్నారు. వీరితోపాటు నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాల, జడ్పీ హైస్కూల్‌, మున్సిపల్‌ హైస్కూల్‌, సాంఘిక సంక్షేమ మోడల్‌ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. ట్రిపుల్‌ ఐటీలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లు మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ కాకుండా ఇతర రాష్ర్టాల్లో చదివిన విద్యార్థులు పేమెంట్‌ సీటు (పాలిసెట్‌ రాయకున్నాసరే)కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ముఖ్యతేదీలు:

    @ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్ట్ 2

    @ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్ట్ 12

    @ పీహెచ్‌/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌ విద్యార్థులు దరఖాస్తు చేసిన హార్డ్‌కాపీలను పంపించేందుకు చివరితేదీ: ఆగస్ట్టు 14

    @ జాబితా విడుదల: ఆగస్ట్ 18